‘చేవెళ్ల’ మృతుల కుటుంబాలకు పరిహారం : తెలంగాణ రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు

స్టేట్ బ్యూరో ,డైలీ రిపోర్ట్ ;

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిహారం : మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల అప్పగింతకు అధికారులను కేటాయించామన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :