శుభాంశు శుక్లాకు అశోక చక్ర

న్యూఢిల్లీ డైలీ రిపోర్ట్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)పై అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) సోమవారం భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన అశోక చక్ర( Ashoka Chakra) ప్రదానం చేశారు. రాష్ట్రపతి జాతీయ రాజధానిలోని ప్రధాన రహదారి అయిన కర్తవ్య పథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శుక్లాకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గత సంవత్సరం జూన్‌లో, శుక్లా చారిత్రాత్మక యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన మొదటి భారతీయుడిగా నిలిచారు. రష్యన్ సోయుజ్-11 అంతరిక్ష యాత్రలో వ్యోమగామి రాకేష్ శర్మ ప్రయాణించిన 41 సంవత్సరాల తర్వాత ఆయన 18 రోజుల అంతరిక్ష యాత్ర జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :