విద్యార్థులకు అలర్ట్.. మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు.. వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?

తెలంగాణ ,డైలీ రిపోర్ట్ ;Telangana Schools Half-Day Classes from March 16: పెరుగుతున్న ఎండల దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పనివేళలు ఇవే: సాధారణ పాఠశాలలు: ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. అనంతరం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.పరీక్ష కేంద్రాలు: పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయి. పదో తరగతి విద్యార్థులకు: పరీక్షలు ముగిసే వరకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు (Special Classes) కొనసాగుతాయి. వేసవి సెలవులు & కొత్త విద్యా సంవత్సరం: ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా ప్రకటించారు. తిరిగి జూన్ 12 నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

రంజాన్ ప్రత్యేక వెసులుబాటు: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉర్దూ మీడియం పాఠశాలలు మరియు డైట్ (DIET) కళాశాలలకు ప్రత్యేక పనివేళలు కేటాయించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు: ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతులు జరుగుతాయి. మార్చి 20 తర్వాత సిలబస్ పూర్తి చేసేందుకు అదనపు తరగతులు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ ఆదేశించింది.


Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :