డైలీ రిపోర్ట్ తెలుగు ;ఈ ఆదివారం టీం ఇండియా క్రికెట్ అభిమానులకు పండుగ కానుంది. ఎందుకంటే భారత్ పురుషుల జట్టు, మహిళల జట్టు రెండు కీలక మ్యాచ్లు ఆడనున్నాయి. ఐదు టీ-20ల సిరీస్లో భారత్, ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో నేడు జరిగే మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభం అవుతుంది.
Post Views: 32









